యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జవహార్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను జేఎన్టీయూహెచ్ విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 16, 18, 21, 23, మరియు 25 తేదీలలో బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ కోర్సులకు సంబంధించిన వివిధ బ్రాంచ్ లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు కొన్ని బ్రాంచ్ లకు 10.30 AM-12.30 PM వరకు, మరికొన్ని బ్రాంచ్ లకు 2.30 PM నుండి 4.30 PM వరకు జరగనున్నాయి. పరీక్ష వ్యవధిని కూడా 3 గంటల నుండి 2 గంటలకు తగ్గించారు. అలాగే ప్రశ్నపత్రం విధానంలో కూడా కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తుంది.
ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్:
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu