ఛత్తీస్గఢ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చరణ్ దాస్ మహంత్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సందర్శనకు విచ్చేశారు. ఈ సందర్భంగా.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఘన స్వాగతం చెప్పారు. స్పీకర్ పోచారం చాంబర్లో చరణ్ దాస్ను శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత తెలంగాణ శాసనసభ తరపున చరణ్ దాస్కు ఓ జ్ఞాపికను బహుకరించారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిని చరణ్ దాస్కు వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, ఇతర అసెంబ్లీ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు చరణ్ దాస్ మహంత్, 2019 జనవరిలో ఛత్తీస్గఢ్ శాసనసభకు స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈయన గతంలో ఒకసారి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సందర్శించిన ఆయన కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతోందని ప్రశంసించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ