కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగా మెట్రో రైల్ ప్రయాణ సమయాలపై మార్పులు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 3, గురువారం నుండి ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు మెట్రో రైళ్లు ప్రారంభం అవుతుండగా, ప్రయాణికుల సౌకర్యార్ధం అరగంట పాటు ముందుగా ఉదయం 6.30 గంటల నుంచి సేవల్ని అందుబాటులోకి తెస్తున్నామని, ప్రయాణికులు అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉండి ఇప్పటివరకు సేవలు ప్రారంభం కాని గాంధీ హాస్పటల్, భరత్నగర్, మూసాపేట్ వంటి మెట్రో స్టేషన్లు కూడా బుధవారం నుండి తెరుచుకోనున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ