తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు, అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, ఇప్పటికే తెలంగాణలో కురిసిన వర్షాలతో పంటలకు భారీ నష్టమే జరిగింది. పంట నష్టాన్ని అంచనావేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈ సమయంలో.. మరోసారి వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఖమ్మం, మెదక్, హనుమకొండ జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో 30 డిగ్రీల కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF