ప్రపంచ స్థాయి రెటీనా కేర్ సెంటర్ అభివృద్ధికి హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్.. బజాజ్ గ్రూప్తో ఒప్పందం చేసుకుంది. రెటీనా సమస్యలపై అధ్యయనం, పరిష్కారం కొరకు అనంత్ బజాజ్ రెటీనా ఇనిస్టిట్యూట్ పేరిట ప్రపంచ స్థాయి రెటీనా కేర్ సెంటర్ను అభివృద్ధి చేయనున్నాయి. శుక్రవారం వర్చువల్ కార్యక్రమంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎండీ శేఖర్ బజాజ్, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్ధ ఎగ్జిక్యూటివ్ చైర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. అంధత్వ సమస్యపై ఎక్సెలెన్స్ సెంటర్ల ర్వారా కృషి చేస్తున్నట్లు ప్రశాంత్ గార్గ్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అంధత్వ నివారణకు అనంత్ బజాజ్ రెటీనా ఇనిస్టిట్యూట్ ద్వారా సేవలందిస్తామని శేఖర్ బజాజ్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF