తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 2020-21 బ్యాచ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతికి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తాజాగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తునట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరిపేలా ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,769 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 4,59,228 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడం సహా ఇతర అన్ని కరోనా నిబంధనలను అమలు చేస్తున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ