జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకు అవసరం. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేద్దాం. 7 నుంచి 14 స్థానాల్లోనా?, రెండు ఎంపీ స్థానాల్లోనా? అనేది నిర్ణయించి చెప్పండి” అని పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే తెలంగాణలోని కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడతానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY