రేపు, ఎల్లుండి గుజరాత్‌ లో ప్రధాని మోదీ పర్యటన, రూ.15670 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు

PM Modi will Visit Gujarat on 19-20 October will Dedicate and Lay Foundation Stone of Projects Worth of Rs 15670 Cr, Prime Minister Modi Gujarat Tour on 19-20 October, Prime Minister Modi Gujarat Tour, Prime Minister Gujarat Tour, PM Narendra Modi will Visit Gujarat, Mango News, Mango News Telugu, PM Modi Gujarat Tour, Modi Tour To Gujarat, Gujarat Latest News And Updates, PM Modi Tour Live Updates, PM Narendra Modi Gujarat Tour, National News, National Politics, Narendra Modi Gujarat Tour

ప్రధాని నరేంద్ర మోదీ రేపు, ఎల్లుండి (అక్టోబర్ 19, 20వ తేదీల్లో) గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ. 15,670 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాప‌నలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అక్టోబరు 19, బుధవారం ఉదయం 9.45 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో డిఫెక్స్‌పో-22ను ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అదాలజ్‌లో మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు జునాగఢ్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఇండియా అర్బన్ హౌసింగ్ కాన్‌క్లేవ్-2022ను ప్రారంభించి, రాజ్‌కోట్‌లో పలు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వడంతో పాటుగా, మరికొన్నింటికి శంకుస్థాప‌నలు చేయనున్నారు.. రాత్రి 7.20 గంటలకు రాజ్‌కోట్‌లో ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ ఎక్జిబిషన్ ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇక అక్టోబరు 20, గురువారం ఉదయం 9.45 గంటలకు కెవాడియాలో మిషన్ లైఫ్‌ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కెవాడియాలో జరిగే 10వ హెడ్స్ ఆఫ్ మిషన్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.45 గంటలకు వ్యారా.1లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =