రాష్ట్రంలో రోజువారీ వర్కర్ల కనీస వేతనం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ వర్కర్లకు, పార్ట్టైమ్ వర్కర్లకు మరియు కన్సాలిడేటెడ్ పే వర్కర్లకు కనీస వేతనాన్ని 30 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రోజువారీ వర్కర్ల కనీస వేతనం రూ.300 నుంచి రూ.390కి పెరిగింది. పార్ట్టైమ్ వర్కర్ల వేతనం నెలకు రూ.4000 నుంచి రూ. 5,200 కు పెరగగా, ఫుల్ టైం కంటింజెంట్ వర్కర్స్/కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం నెలకు రూ.8000 నుంచి రూ.10,400 కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కనీస వేతనం పెంపు ఉత్తర్వులు జూన్ 2021 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ