మెట్రోలో ప్రయాణించిన జనసేనాని పవన్ కళ్యాణ్, తోటి ప్రయాణికులతో సంభాషణ

Janasena Chief Pawan Kalyan Traveled In Hyderabad Metro Today,Mango News Telugu,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Powerstar Pawan Kalyan, Power Star Pawan Kalyan takes Metro ride in Hyderabad,Janasena Cheif Pawan Kalyan Travelled From Madhapur To Miyapur In Hyderabad Metro Train,Vakeel Saab Shooting,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Shooting Updates,Vakeel Saab Telugu Movie Shooting Latest News

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు. ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు.

అలాగే మియాపూర్ వెళ్లే ట్రైన్ లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతిందని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారు.. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 3 =