వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గొర్రెకుంట గ్రామ పరిధిలోని గొనె సంచుల గోదాం సమీపంలోని బావిలో గత గురువారం నాడు నాలుగు, శుక్రవారం నాడు ఐదు మృతదేహాలు బైటపడ్డాయి. సంచలనం సృష్టించిన ఈ కేసును వరంగల్ పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దింపి సత్వర విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనలో మిస్టరీ వీడినట్టు తెలుస్తుంది.
బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ ఈ కేసులో కీలక నిందితుడని పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తుంది. బర్త్ డే పార్టీ సందర్భంగా కూల్ డ్రింక్స్ లో నిద్ర మాత్రలు కలిపి, వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాకనే వారిని బావిలో పడేసినట్లు విచారణలో సంజయ్ కుమార్ వెల్లడించినట్టుగా సమాచారం. కాల్ డేటా ఆధారంగా పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించి ఈ కేసును ఛేదించినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి ఈ కేసు పూర్తీ వివరాలను పోలీసులు ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu