వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అశేష భక్తజనం కోలాహలం మధ్య అత్యంత ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అయితే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రతి ఏడాది భారీ వినాయకుడిని ప్రతిష్టించే కమిటీ, ఈసారి ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పండుగకు నెలలు ముందుగానే విగ్రహ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తారు, ఈ నేపథ్యంలో ముందుగానే కమిటీ ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. మరో వైపు మే 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]