టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక సూచన

#KCR, CM KCR assures ryots of paddy procurement, Farmers Protest Over Paddy Procurement, KCR Protest Over Paddy Procurement, KTR, KTR Appeals Party Cadre to Take Permission from District Collectors, KTR Appeals Party Cadre to Take Permission from District Collectors for Protests, KTR Appeals Party Cadre to Take Permission from District Collectors for Protests on NOV 12th, Mango News, Paddy Procurement, Paddy procurement In Telangana, Protest with Farmers on November 12th over Paddy Procurement

తెలంగాణ రాష్టంలో రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనేవరకు వదిలిపెట్టమని, ఈ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, నవంబర్ 12, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ల‌క్ష‌లాది మంది రైతుల‌తో క‌లిసి టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ధర్నాల నిర్వహణ విషయంలో పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మద్దతుగా నవంబర్ 12న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాలో పలువురు రాష్ట్ర మంత్రులు, కీలక టీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + one =