ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ కార్పోరేటర్ గా గెలుపొందిన ఆకుల రమేశ్ గౌడ్ గురువారం నాడు మృతి చెందారు. ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించారు. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆకుల రమేశ్ గౌడ్ మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ