2020 వ సంవత్సరం నుంచి 2021 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలంతా మరికొద్ది గంటల్లో అడుగుపెట్టనున్నారు. 2021కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కాగా భారత్ కంటే ముందే పలు దేశాలు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాయి. పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా దేశం అందరికంటే ముందుగా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అనంతరం టోంగా, కిరిబాటి దీవులు 2021 లోకి అడుగుపెట్టాయి. ఇక ప్రపంచంలో కీలక దేశాల్లో ఒకటైన న్యూజిలాండ్ కూడా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించింది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా దేశం 2021 లోకి అడుగుపెట్టనుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద వేడుకలతో ఆ దేశ ప్రజలు స్వాగతం చెప్పనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ