కరోనా పరిస్థితుల వలన తెలుగు సినీ పరిశ్రమపై పడిన ప్రభావం, ఎదుర్కొంటున్న సమస్యలు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు త్వరలో భేటీ కానున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆగస్టు నెలాఖరులో సీఎం వైఎస్ జగన్ తో సినీ పెద్దల భేటీ జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తో జరిగే భేటీలో విన్నవించాల్సిన విషయాలపై చర్చించేందుకు హైదరాబాద్ లో ప్రముఖ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పలువురు సినీ పెద్దలు సమావేశం అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నటులు నాగార్జున, ఆర్.నారాయణమూర్తి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, కే.ఎస్.రామారావు, స్రవంతి రవికిశోర్, సి.కళ్యాణ్, ఎన్వీప్రసాద్, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, జెమిని కిరణ్, సుప్రియ, విక్కీ-వంశీ, దర్శకులు కొరటాల శివ, వి.వి.వినాయక్, మెహర్ రమేష్, ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ నారాయణ దాస్, సినిమా రంగంలోని పలు విభాగాలకు చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా ఇటీవల ఏపీలో జారీ చేసిన కొత్త జీవో, టికెట్ల రేట్ల పెంపు విధానం, ఐదో షో అనుమతి, సినీ, థియేటర్ కార్మికుల సమస్యలు, సినీపరిశ్రమ సంబంధిత రంగాలకు రాయితీలు వంటి అంశాలతో పాటుగా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ భేటీలో కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ