రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును తెలంగాణ ప్రభుత్వం 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల బీమా వయసు మరియు స్లాబులపై సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల గరిష్ఠ బీమా వయసును 53 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలకు పెంచారు. కనిష్ఠ బీమా వయసును 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించారు. ఇక కనిష్ఠ ప్రీమియం స్లాబును రూ.500 నుంచి 750కి పెంచగా, గరిష్ఠ ప్రీమియం స్లాబును రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారు. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ