తెలంగాణ రాష్ట్రంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు నిర్మాత అల్లు అరవింద్, యువ కథానాయకుడు రామ్ చరణ్, నటుడు నాగబాబు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన అభిమానులకు చిరంజీవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ట్విట్టర్ లో కూడా వాయిస్ సందేశం ఇస్తూ “రక్త దానం చేయండి, ప్రాణ దాతలు కండి” అంటూ అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 25, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ