తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,590 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా వలన ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1592 కి పెరిగింది.

ఇక గత 24 గంటల్లో 349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,88,926 కు చేరుకుంది. ప్రస్తుతం 3,072 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో 77 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాడు 29,449 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 77,11,810 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,07,195 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =