వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం ఇల్లందలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అందిస్తున్న నిత్యావసర సరుకులను 565 మంది నిరుపేదలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంపై ప్రతిపక్షాల చేస్తున్న వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలన్నారు. దేశానికి, ప్రజలకు తమకు మాలిన నీతులు చెప్పి, ప్రతిపక్షాలు పబ్బం గుడపుతున్నాయన్నారు.
ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కకు పెట్టి, ప్రజలను ఆదుకున్నవాడే నిజమైన నాయకుడని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. రైతులకు రుణ మాఫీ, రైతు బంధు పెట్టుబడులు, ఉచితంగా 24 గంటల విద్యుత్, రైతు బీమా, పంటలు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటి చర్యలు ఏ ప్రభుత్వమూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ అన్నం పెట్టే రైతును అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలాంటి మనసున్న సీఎంని నేను నా 40ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడలేదని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లాక్ డౌన్, స్వీయ నియంత్రణని, సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూ ఐక్యంగా పోరాడాలి. ప్రభుత్వ ఆదాయం కన్నా, ప్రజల ప్రాణాలే ముఖ్యమని సీఎం కేసీఆర్ భావించి, అత్యంత క్లిష్ట సమయంలోనూ ప్రజల క్షేమాన్ని, వారి సంక్షేమాన్ని వీడకుండా అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నారని చెప్పారు. రైతుని రాజుని చేయడం కోసం సీఎం కేసీఆర్ అహర్నిషలు కష్ట పడుతున్నారని అన్నారు. ఈ కష్ట కాలంలోనే ఉన్నోళ్ళు లేనోళ్ళకు సాయం చేసి ఆదుకోవాలని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu