ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశీయ ఉత్పత్తిదారులు మరియు తయారీదారులకు మద్దతుగా దేశీయ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాలనీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) క్యాంటీన్లలో ఇకపై దేశీయంగా తయారు చేసిన వస్తువుల్ని మాత్రమే విక్రయించేలా నిర్ణయం తీసుకున్నారు. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక జూన్ 1 వ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ సహా సీఏపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఇతర అన్ని బలగాలకు చెందిన క్యాంటీన్స్ లో స్వదేశీ వస్తువులే అమ్మనున్నారు. ప్రతి సంవత్సరం ఈ క్యాంటీన్స్ లో రూ.2,500 కోట్లకు పైగా విలువ చేసే ఉత్పత్తులు అమ్ముడవుతునట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu