వచ్చే వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ మేరకు ఆయన బుధవారం పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి, జనగామ కలెక్టర్ శివలింగయ్య, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి సహా కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మొదట దేవాదుల ప్రాజెక్టు పనులను చేపట్టిన కాంట్రాక్టర్ సరిగా చేయలేకపోవడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రీ టెండర్ పిలిపించామని, అయినాకూడా సమయానికి పనులు ముందుకు సాగడం లేదని అధికారులకు గుర్తుచేశారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు ఆరు నెల్లల్లో పూర్తి చేస్తామని చెప్పామని, అయితే ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా అనుకున్నంతగా పూర్తికావడం లేదని తెలిపారు. త్వరలో సీఎం కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులపై హైదరాబాద్లో సమీక్ష నిర్వహించనున్నారని, ఈ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE