తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి గంగుల మల్లయ్య బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్య ఈరోజు తుదిశ్వాస విడిచారు. అయితే మల్లయ్యకు 87 సంవత్సరాలని, ఆయన తమ స్వగృహంలోనే కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో తండ్రి మరణవార్త గురించి సమాచారం అందుకున్న మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన కరీంనగర్ లోని తన ఇంటికి చేరుకున్నారు. తండ్రి భౌతికకాయాన్ని చూసిన మంత్రి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇక మంత్రి కమలాకర్ తండ్రి మల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్, మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇదేక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మల్లయ్య మృతికి సంతాపం ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE