3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే – మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao Praises CM KCR Over His Vision and Commitment, Minister Errabelli Dayakar Rao Praises CM KCR, Minister Errabelli Dayakar Rao, Errabelli Dayakar Rao, Minister Errabelli, CM KCR, CM KCR Vision and Commitment, Minister Errabelli Dayakar Rao Speech On CM KCR Over His Vision and Commitment, Vision and Commitment, Minister Errabelli Dayakar Rao Speech, Errabelli Dayakar Rao Speech, Minister, Telangana Minister, Telangana Minister Errabelli Dayakar Rao, Telangana, K Chandrashekar Rao, Chief minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈరోజు (శనివారం) మధ్యాహ్నం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బంజారా నగర్ దుబ్బ తండాలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో దూసుకుపోతోందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత 3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. యేడాదికి ఒక్కొక్క తండాకు 5 లక్షల చొప్పున కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ఆ నిధుల ద్వారా అభివృద్ధి ఫలాలు మారుమూల ప్రాంతాల పేదలకు కూడా అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బంజారాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు, భూ కేటాయింపులు వంటివి చేయడం జరిగిందని చెప్పారు. అలాగే, తెలంగాణ సంస్కృతిలో భాగమైన పండుగలను అద్భుతంగా జరుపుకుంటున్నామని మంత్రి దయాకర్ రావు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =