తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 16, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 92,255 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 703 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.76% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 2006 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 70,132 కి చేరింది. ప్రస్తుతం 21,420 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 76.01 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 147, రంగారెడ్డి జిల్లాలో 85, కరీంనగర్ లో 69, పెద్దపల్లిలో 62, సిద్దిపేటలో 58, మేడ్చల్ లో 51, వరంగల్ అర్బన్ లో 44, ఖమ్మంలో 44, నిజామాబాద్ లో 38, నల్గొండలో 37, మహబూబాబాద్ లో 31, జగిత్యాలలో 31, మహబూబ్ నగర్ లో 30, సంగారెడ్డిలో 29, జోగులాంబ గద్వాల్ లో 21 , మంచిర్యాలలో 17, నాగర్ కర్నూల్ లో 15, సూర్యాపేటలో 12, ఆసిఫాబాద్ లో 11, ఆదిలాబాద్ లో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu