కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్) అమలుకు క్యాబినేట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు (శనివారం) సమావేశమైన కేంద్ర క్యాబినేట్.. 1,600 కోట్ల రూపాయల బడ్జెట్తో రానున్న ఐదేళ్ల పాటు ఈ స్కీమ్ అమలుకు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో హెల్త్కేర్ డిజిటల్ హెల్త్ సొల్యూషన్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని క్యాబినేట్ అభిప్రాయపడింది.
కోవిన్, ఆరోగ్య సేతు, ఇంకా ఈసంజీవని వంటివి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతను అందించడంలో ముందుంటున్నాయి. జన్ ధన్, ఆధార్ మరియు మొబైల్ (JAM) రూపంలో ప్రభుత్వం యొక్క ఇతర డిజిటల్ కార్యక్రమాల ఆధారంగా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ విస్తృతమైన డేటాను అందించడం ద్వారా సంబంధిత శాఖలకు ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ పథకం ద్వారా పౌరులు ఎవరైనా ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’ ఓపెన్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను డిజిటల్గా నమోదు చేసుకోవచ్చు. ఈ రికార్డులు భవిష్యత్తులో వైద్య రంగంలో సేవలందించే వారికి ఉపయోగపడతాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ