ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు?, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు

Minister KTR Asks Several Questions to Union Minister Kishan Reddy on BRS MLAs Poaching Case,Minister KTR Asks Several Questions,Union Minister Kishan Reddy,BRS MLAs Poaching Case,Mango News,Mango News Telugu,Telangana Sit,Sit Investigation Mla Poaching Case,Trs Mla Poaching Case,Telangana Mla Poaching Case,Telangana Mla Poaching Case Latest News And Updates,Telangana Mla Poaching ,Telangana Bjp,Telangana Cm Kcr,Trs Party,Brs Party,Ysrtp,Brs Party Latest News And Updates

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్స్ చేశారు. “ఆ సాములతో అసలు సంబంధమే లేదన్నోళ్లు, ఈ స్కాము సీబీఐకి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరు?, మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే, మీ వెన్నులో వణుకు మొదలైంది. అప్పుడు భుజాలు తడుముకున్న మీరు, ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారు? మీకు ఏ సంబంధం లేకపోతే పలుమార్లు కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు?, సీబీఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు?, మీ జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా,ఈ పట్టలేనంత సంతోషం?, ఒకప్పుడు సీబీఐకి కేసు ఇస్తే నిందితులు భయపడే పరిస్థితి నుండి ఇవ్వాళ సీబీఐకి కేసు అప్పజెప్తే మీరు సంబరాలు చేసుకుంటున్నారు అంటేనే ఆ సంస్థను మీ హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుంది. కెమెరాల సాక్షిగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికారు” అంటూ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

“రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఉంది మీ వ్యవహారం!, దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో మీరు కాంగ్రెస్ నే మించిపోయారు. ఒకప్పుడు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే వాళ్లు. ఇప్పుడు సీబీఐని, కంట్రోల్డ్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. సీబీఐ దర్యాప్తుతో పాటు దొరికిన దొంగలపై, బీజేపీ బ్రోకర్స్ పై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా?, మీరు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయగలరేమో గానీ, శాస్త్రీయ పరీక్షలు (సైంటిఫిక్ టెస్టు) లను ఎవరూ మార్చలేరు. ఏమార్చలేరు. మా సవాల్ స్వీకరించే దమ్ముందా?, మీ దగ్గర విషయం లేదు కాబట్టే 8 ఏళ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో ‘విషప్రయోగం’ చేస్తున్న మాట నిజంకాదా?, మీ బీజేపీ నాయకత్వం దగ్గర సరుకు లేదు కాబట్టే, ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా?, మీ చేతిలోని సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి కీలుబొమ్మలు సాగించే విచారణ ఎలా ఉంటుందో దేశంలో అందరికీ తెలుసు. కానీ మీ బీజేపీ బండారంపై నిజమైన ప్రజాక్షేత్రంలో విచారణ ఎప్పుడో పూర్తయింది. సరైన సమయంలో మీపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం కూడా సిద్ధంగా ఉంది” అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twelve =