ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారి నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ ఇందిరా దేవి భౌతిక కాయం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. హీరో మహేశ్ బాబు, సూపర్ కృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందిరా దేవి మృతిపట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక హీరో మహేశ్ బాబు, మంత్రి కేటీఆర్ సన్నిహితులన్న విషయం విదితమే. ఆయనతో పాటు నాగార్జున, మోహన్ బాబు, గోపీచంద్, అల్లు అరవింద్ తదితరులు కూడా ఇందిరా దేవికి నివాళి అర్పించారు. ఇందిరా దేవి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY