తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మరో సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఒప్పో సంస్థ తన 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను భారతదేశంలోనే మొదటగా హైదరాబాద్లో ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్లోని ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు మరోసారి దృఢమైన ఆమోదం లభించినట్లయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఇటీవలే ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్ధ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్సీఏ) దాదాపు 150 మిలియన్ డాలర్ల(సుమారు రూ.1,100 కోట్లు) పెట్టుబడులతో హైదరాబాద్లో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Another emphatic endorsement of the innovation ecosystem in Hyderabad 👍
OPPO sets up its first 5G Innovation Lab in India at Hyderabad https://t.co/9unnQkSTlA
— KTR (@KTRTRS) December 22, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ