తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (ఫిబ్రవరి 23, బుధవారం) మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-4లో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.6,805 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఇది తెలంగాణ సాగునీటి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మల్లన్నసాగర్ విశేషాలతో కూడిన ఒక వీడియోను కూడా జత చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన ఈ 50 టీఎంసీల రిజర్వాయర్ 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మరియు భారతదేశానికి గొప్ప గర్వకారణమైన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరించిందని మీరు అనుకుంటున్నారు? అని నెటిజన్లను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Tomorrow will be a momentous day in Telangana’s irrigation history as Hon’ble CM KCR Garu will be dedicating “Mallanna Sagar” to the Nation
This 50 TMC reservoir is part of the world’s largest lift irrigation project #KaleshwaramProject and will irrigate 11.29 Lakh Acres pic.twitter.com/RlOB6mjepE
— KTR (@KTRTRS) February 22, 2022
World’s largest lift irrigation project #Kaleshwaram reaches a major milestone today with the dedication of #MallannaSagar reservoir
How much do you think Govt of India contributed to this project that is largest in the world & great pride for India?
Any guesses? pic.twitter.com/wHIGNfp17c
— KTR (@KTRTRS) February 23, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ