ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ఏపీ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీమణి భారతి, చిన్నాన్న టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తదితరులతో కలిసి వచ్చిన సీఎం జగన్ కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకున్నారు. కాలేజీ ఆవరణలో నిర్వహించిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతక్రియల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి తిరిగి కడపకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సగౌరవంగా మంత్రి గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలికింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులతోపాటు పలు పార్టీల నాయకులు కూడా హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా మేకపాటి అభిమానులు భారీగా తరలివచ్చి తమ ప్రియతమ నేతను కడసారి చూసుకుని అశ్రునయనాలతో వీడ్కోలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ