రాష్ట్రంలో రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపీణి ప్రారంభం, రూ.339.73 కోట్ల వ్యయం: మంత్రి కేటీఆర్

Minister KTR Announces Distribution of Bathukamma Sarees will Start in the State from September 25, Govt To Distribute 1.18 Crore Bathukamma Sarees, Telangana Govt Readies More than 1 Cr Bathukamma Sarees, Bathukamma Sarees Distribution, Bathukamma Sarees, Mango News, Mango News Telugu, Telangana Govt Bathukamma Sarees, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Celebration, Telangana Bathukamma Celebration, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Latest News And Updates, Telangana Govt News And Live Updates

తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ రేపటి నుంచే (సెప్టెంబర్ 22, గురువారం) ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నుండి ప్రారంభం అవుతుందన్నారు. చీరల పంపీణీ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని, వారి వేతనాలు రెట్టింపు అయ్యాయని, తద్వారా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.

సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో ముఖ్యమైన కె.చంద్రశేఖర్ రావు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని చెప్పారు. బతుకమ్మ చీరెల పంపిణీతో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా దొరికిందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బతుకమ్మ చీరల వంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేత కార్మికుల ఒకవైపు ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే, టెక్స్ టైల్ ఉత్పత్తులపైన జీఎస్టీ వంటి నిర్ణయాలతో నేతన్నలను నిలువునా ముంచే నేత కార్మికుల వ్యతిరేక చర్యలను కేంద్రం తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం నేతన్నలను, వారి పరిశ్రమను, వారి జీవితాలను పట్టించుకోకున్నా, సీఎం కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలకు కోసం తాము నిరంతరం నిబద్దతతో పనిచేస్తామని చెప్పారు.

ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సుమారు కోటి బతుకమ్మ చీరలను పంపీణి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వైరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్ టైల్ శాఖ తయారు చేసిందన్నారు. గ్రామల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు అభిప్రాయాలు, ఆశక్తులు, నిఫ్ట్ డిజైనర్లలతో సహకారంతో సరైన డిజైన్ లు మరియు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను నూతన డిజైనులతో ఉత్పత్తి చేశామన్నారు. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో తయారు చేయబడిన 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందన్నారు. 6 మీట్లర్ల (5.50 + 1.00) మీటర్ల పొడవుగల 92.00 లక్షల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించడం జరిగిందని చెప్పారు. మొత్తంగా కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డ్ కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందిచనున్నట్లు తెలిపారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఈసంవత్సరం కలుపుకుని ఇప్పటిదాకా సూమారు 5 కోట్ల 81 లక్షల చీరలను ఆడబిడ్డలకు అయిదు దఫాలుగా అందించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − ten =