కరోనాపై చేస్తున్న పోరాటంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్న ఈ సిబ్బంది సేవల్ని వివరిస్తూ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఓ గీతాన్ని రూపొందించారు. కరోనాపై అవగాహన కల్పించే ఈ గీతాన్ని కందికొండ రాయగా, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఈ గీతాన్ని ప్రగతిభవన్లో ఆవిష్కరించారు. అందంగా కంపోజ్ చేసిన ఈ గీతాన్ని ఫ్రంట్లైన్ కార్మికులందరికీ అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. పాటను నిర్మించిన బొంతు శ్రీదేవికి, ఇందులో పాలుపంచుకున్న కందికొండ, రాహుల్ సిప్లిగంజ్ లకు మంత్రి కేటిఆర్ అభినందనలు తెలిపారు.
A beautifully composed song dedicated to all our frontline workers combating the #COVID19 pandemic. Thanks to @bonthu_sridevi @Rahulsipligunj and Kandikonda for coming up with this:https://t.co/ls80Zjg1ra
— KTR (@KTRTRS) April 28, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]