కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత నాలుగు రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరొకా నేతృత్వంలోని ఈ బృందం ఏప్రిల్ 28, మంగళవారం నాడు జీహెఛ్ఎంసీ ప్రదాన కార్యాలయాన్ని సందర్శించింది. ముందుగా కోవిడ్-19 కంట్రోల్ రూం పనితీరును తనిఖీ చేసింది. కంట్రోల్ రూమ్ లో నిర్వహిస్తున్న విధులు గురించి ఓఎస్డి అనురాధ వివరించారు. దీనిపై కేంద్ర బృందం పలు అంశాలపై ప్రశ్నించి, అప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ర్యాండమ్ గా ఫోన్ చేయించి దృవీకరించుకున్నారు.
వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు గురించి, వారి నుండి కంట్రోల్ రూమ్ కు వస్తున్న కాల్స్ గురించి, అన్నపూర్ణ మొబైల్ కేంద్రాల ద్వారా ఏ విదంగా టై అప్ చేసి రెగ్యులర్ గా భోజనం పెడుతున్నారు, ఏ ఏ శాఖలు, జిల్లాలతో సమానవ్యయం సమన్వయం చేసుకుంటున్నారనే వివరాలు తెలుసుకున్నారు. కరోనా నేపద్యంలో ఆహారం పంపిణీ చేసిన వారి వివరాలు, ఎంత మందికి ఆహారం అందింది అనే వివరాలు తెలుసుకున్నారు. మూడు షిఫ్టులలో 24/7 పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. అత్యవసర సేవలు అందించుటకు 32 అంబులెన్సు లను జోనల్ కమీషనర్ కార్యాలయాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విదేశాలనుండి వచ్చి ఇక్కడ హోటల్స్ లో ఉంటున్న వారిని పర్యాటక అధికారి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
హెల్ప్ లైన్ నెంబర్ 040-2111 11 11 కు వచ్చిన ప్రతి కాల్ ను రిజిస్టర్ లో నమోదుచేసి స్పందిస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ కు ఏడు లైన్స్ ఉన్నట్లు తెలిపారు. అనుమానిత కేసులపై తదుపరి చర్యల నిమిత్తం సర్కిల్ కార్యాలయాలకు పంపుతున్నట్లు తెలిపారు. విదేశాలనుండి వచ్చిన వారు, హోం క్వారంటైన్ లో ఉంచిన వారి ఆరోగ్య స్థితిపై ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో మంత్రులు, జీహెఛ్ఎంసీ చేపట్టిన కార్యక్రమాల వీడియోలను కేంద్ర కమిటి చూసింది.
పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డిఆర్ఎఫ్ వారి సేవలను అభినందిస్తూ మంత్రి కేటిఆర్ వారితో భోజనం చేసిన వీడియోలను చూసి అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు జీహెఛ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి, ఆన్ లైన్ మానిటరింగ్ సిస్టం ను పరిశీలించారు. కేసుల మానిటరింగ్ గురించి కమిటీకి కమీషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ వివరించారు. ఈ బృందంలో కేంద్ర ప్రజారోగ్యశాఖ సీనియర్ వైద్యులు డా.చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహర సంస్థ డైరెక్టర్ డా.హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదిలు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu