తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఫామ్ హౌజ్లో కాలు జారిపడిపోవడంతో.. వైద్యులు కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ హైదరాబాద్ నందిహిల్స్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అప్పట్లో పరామర్శించని జగన్.. తాజాగా కేసీఆర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈరోజు ఉదయమే జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి.. బౌగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ తరుపున వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి బంజారాహిల్స్లోని నందిహిల్స్లో ఉన్న కేసీఆర్ ఇంటికి జగన్ చేరుకున్నారు. అక్కడ కేటీఆర్.. జగన్కు స్వాగతం పలికి స్వయంగా ఇంటిలోకి తీసుకెళ్లారు. అనంతరం కేసీఆర్తో జగన్ సమావేశమయ్యారు.
అయితే ఇన్నిరోజులు కేసీఆర్ను కలవకుండా.. సరిగ్గా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జగన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ను పరామర్శించడానికే జగన్ వచ్చారని.. మర్యాదపూర్వకంగానే కలిశారని చెబుతున్నాయి. వారిమధ్య ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని అంటున్నాయి. ఏది ఏమయినప్పటికీ ఈ సమయంలో కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి కలవడం ప్రధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY