తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీ రామారావు శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కైటెక్స్ వస్త్ర పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.1600 కోట్లతో నిర్మించే ఈ కైటెక్స్ వస్త్ర పరిశ్రమలో దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనున్నదని తెలిపారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా కైటెక్స్ గ్రూప్ కు పేరుంది. గత సెప్టెంబర్ లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కైటెక్స్ గ్రూప్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ధర్మా రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
అలాగే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో గణేష్ గ్రూప్ (గణేష్ ఎకోపెట్ & గణేష్ ఎకోటెక్) యూనిట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దశలవారీగా రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గణేష్ ఎకోపెట్ రీసైకిల్ ఫిలమెంట్ నూలు మరియు రీసైకిల్ పాలిస్టర్ చిప్లను తయారు చేస్తుంది. ఈ యూనిట్ ద్వారా 500 మందికి పైగా ఉపాధి లభించనుందని తెలిపారు. ఇక గణేష్ ఎకోటెక్ రూ.250 కోట్లతో ఏర్పాటైందని, ఈ యూనిట్ వాషెడ్ పెట్ ఫ్లేక్స్ మరియు పాలీప్రొఫైలిన్ ఫైబర్లను తయారు చేస్తుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ