తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్ ఈవీ రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్లోని నిమ్జ్లో అల్ట్రా మోడరన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగాన్ని ట్రైటాన్ ఈవీ సంస్థ స్థాపించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం, ట్రైటాన్ ఈవీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 25 వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. ట్రైటాన్ ఈవీ మొదటి ఐదేళ్ళలో 50,000 వాహనాలను ఉత్పత్తి చేయబోతోందని, అందులో సెమీ ట్రక్కులు, సెడాన్లు, లగ్జరీ ఎస్యూవీలు మరియు రిక్షాలు వంటివి ఉండనున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ