తెలంగాణలో రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం ఉదయం 11 గం. లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు ధృవీకరించారు. రెండ్రోజుల క్రితమే పేపర్ కరెక్షన్ పనులు పూర్తయ్యాయని, ఫలితాలు కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల కోసం బోర్డు వేచి ఉందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి దీనిపై స్పష్టనిచ్చారు. రేపు ఉదయం ఫలితాలను ప్రకటించనున్నామని, ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని వెల్లడించారు.
ఇక విద్యార్థుల తమ ఫలితాల కొరకు బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్ను https://tsbienew.cgg.gov.in/ సందర్శించవచ్చని తెలిపారు. అలాగే, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in వంటి ఇతర సైట్స్ లో కూడా చూడొచ్చని ప్రకటించారు. విద్యార్థులకు మరింత సమాచారం కోసం టోల్ఫ్రీ నం.18005999333ను సంప్రదించవచ్చని మంత్రి సూచించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని, అందులో 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు, 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఫలితాలు విడుదల అయిన తర్వాత మరో 15 రోజుల్లో అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY