కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్ధమైంది. మోడ్రన్ లాంగ్వెజెస్, జాగ్రఫీ పరీక్షలను జూన్ 3 న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పాత హాల్ టికెట్లతో గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
మరోవైపు మే 12 నుంచి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ముందుగా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, అనంతరం మొదటి సంవత్సరం పరీక్షల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయనున్నారు. కాగా ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu