మునుగోడు ఉపఎన్నిక ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి చుక్కెదురైంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన ‘కారు’ గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను తొలగించాలని హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, టీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున జ్యోకం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ముందుగా రోలర్, డోలీ, కెమెరా, రోడ్ రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టు మిషన్ మరియు ఓడ గుర్తులు ఈవీఎంలలో చూడటానికి ఇంచుమించు తమ పార్టీ యొక్క కారు గుర్తును పోలీ ఉన్నాయని, దీంతో తమ పార్టీ గుర్తు కారుపై ఓటు వేయాలనుకునే ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని, గతంలో తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ‘ఉచిత గుర్తుల’ జాబితా నుంచి ఆ ఎనిమిదింటిని తొలగించాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భాను ప్రసాదరావు, భరత్ కుమార్ తదితరులు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ గుర్తులపై 48 గంటల్లోగా ఈసీ స్పందించాలని, లేకుంటే కోర్టుని ఆశ్రయిస్తామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
ఈసీ వెంటనే స్పందించకపోవడంతో టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. నేడు హైకోర్టులో విచారణ జరగగా, మునుగోడు ఉపఎన్నికలో ఇప్పటికే స్వతంత్య్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయించామని ఈసీ వివరించింది. ఈసీ వాదనతో ఏకీభవిస్తూ, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ, టీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY