సిద్దిపేట జిల్లాలోకి గోదావరి నీళ్ళొచ్చాయి. రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభమైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్హౌస్ వెట్రన్ను ఏప్రిల్ 24, శుక్రవారం నాడు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ముందుగా చంద్లాపూర్లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ఇద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి సొరంగంలోని పంప్హౌజ్ వద్ద వెట్రన్ను ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు యాదగిరిరెడ్డి, రామలింగారెడ్డి, సతీష్, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
దాదాపు 2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల ఖర్చుతో మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ జలాశయం ప్రారంభంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని లక్షకు పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అనంతరం రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రమించిన కార్మికులు, ఇంజినీర్లు, అధికారులతో కలిసి మంత్రులు హరీష్ రావు, కేటిఆర్ సహపంక్తి భోజనాలు చేశారు.
#KaleshwaramProject
Ministers @trsharish and @KTRTRS formally released the Godavari River water into the Ranganayaka Sagar reservoir in Siddipet District. pic.twitter.com/8xNHk6ZPvR— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 24, 2020
The water from Ranganayaka Sagar reservoir will be able to irrigate 1,14,000 acres of land in both Siddipet and Rajanna Sircilla districts. #KaleshwaramProject pic.twitter.com/3DEkkIgH9Z
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]