కరోనా బాధితుల చికిత్స నిమిత్తం తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)పేరుతో గచ్చిబౌలిలోని 14 అంతస్తుల భవనంలో 1500 పడకల ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కోవిడ్ ఆసుపత్రికి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ-లాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు అందజేశారు. ఈ మేరకు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ను కలిసి చెక్ ను అందజేశారు. గచ్చిబౌలి కోవిడ్ ఆసుపత్రికి సంబంధించి సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ఈ నిధులను ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
As promised gave the cheque of Rs. 50 lakhs from MPLADS towards the construction of Sewerage Treatment Plant(STP) at the #COVID19 dedicated hospital by TIMS today to @Collector_MDL pic.twitter.com/AySKJBJ8sd
— Revanth Reddy (@revanth_anumula) April 29, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu