కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే లాక్డౌన్ అమలులో కొన్ని సడలింపులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 27న ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసినట్టు వెల్లడించారు.
ఏపీలో కొత్త మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ మినహాయింపుల వివరాలు:
- ఆర్థిక రంగానికి మినహాయింపు.
- గ్రామాల్లో నిర్మాణ పనులు, పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు మినహాయింపు.
- వ్యవసాయ రంగం, ఉద్యాన పనులకు అనుమతి.
- మార్కెటింగ్ రంగాలు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్ రంగాలకు మినహాయింపు.
- వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి.
- ఎలాంటి కరోనా లక్షణాలు లేనివారికే పని చేసేందుకు అనుమతి.
- వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనిచేసేలా అనుమతి.
- మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాలలో ఉండే దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్లకు అనుమతి.
- అన్ని అనుమతులు కలిగిఉండే ఈ-కామర్స్ కంపెనీలకు, వారు వాడే కార్లకు మినహాయింపు.
- ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
- ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలకు మినహాయింపులు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu