తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడిగా జూలై 7వ తేదీన గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన అనంతరం రేవంత్ రెడ్డి వరుసగా రాష్ట్రంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డి.కే.శివకుమార్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
ముందుగా కర్ణాటక చేరుకున్న రేవంత్ రెడ్డికి కెంపెగౌడ విమానాశ్రయంలో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాక్షరామయ్య, కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. జూలై 7న జరిగే టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా డి.కే.శివకుమార్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గేతో కూడా భేటీ అయి, 7వ తేదీన జరిగే కార్యక్రమానికి ఆహ్వానించినట్టు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ