క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష, ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్లకు విందు

Minister Koppula Eshwar Reviews Arrangements For Christmas Celebrations Dinner For Christians At Lb Stadium,Minister Koppula Eshwar,Christmas Celebrations,Dinner For Christians At Lb Stadium,Mango News,Mango News Telugu,Telnagana Government Intention,People Celebrate The Festivals Happily, Minister Talasani Presented Christmas Gifts,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Trs Party,Trs Latest News And Updates,Brs Party News And Live Updates,Brs Party Emergence,Election Commision Of India,Telangana Brs Party,Trs Party News,Emergence Brs Programe,

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిష్టియన్లకు విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రిస్మస్ విందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. గురువారం మాసబ్ ట్యాంక్ లోని డిఎస్ఎస్ భవన్ లో క్రిస్మస్ విందు ఏర్పాట్లపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, నగర ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సాయన్న, ప్రకాష్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ తో కలిసి క్రిస్మస్ ఏర్పాట్లపై మంత్రి కొప్పుల సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పలువురు క్రైస్తవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారని చెప్పారు. దాదాపు 15 వేల మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులకు సకాలంలో ఆహ్వానాలు అందజేయాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. వచ్చే అతిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొప్పుల ఆదేశించారు.

అందరూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అన్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పేద క్రైస్తవులకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్ విందులను నిర్వహిస్తూ వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, సంస్కృతులను గౌరవిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో మైనారిటీల సంక్షేమ సలహాదారు ఎ.కే.ఖాన్, మైనారిటీల సంక్షేమ శాఖ డైరెక్టర్ షాన్ వాజ్ ఖాసిమ్, తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రాంతి వెస్లీ, సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =