భారత్ క్రికెట్ జట్టు మాజీ కోచ్, మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీ సందర్భంగా క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై అనిల్ కుంబ్లే సీఎం వైఎస్ జగన్ తో చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ, క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చించి, వీటికోసం తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు తెలిపినట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ