ఆగస్టు 20, గురువారం నాడు జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు 2014 లోనే అనుమతులు వచ్చాయని, భూసేకరణ, ఇతర అవసరాల కోసం రూ.133 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారని చైర్మన్ కు వివరించి, ఈ ప్రాజెక్టు తక్షణమే చేపట్టేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న నీటి వివాదాలకు సంబంధించి ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
జలసౌధ లో ఈ రోజు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశం గారిని కలిసి జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది @TelanganaCMO #KRMB @MinOfJalShakti @INCTelangana @IYCTelangana @TSNSUI pic.twitter.com/Dm2e7BmSi0
— Revanth Reddy (@revanth_anumula) August 20, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu