కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణ అంశం కోర్టులో ఉండడంతో మే 19, మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వాదనలు విన్న అనంతరం జూన్ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు వెల్లడించింది. కరోనా వ్యాప్తి పరిస్థితులపై జూన్ 3న సమీక్ష నిర్వహించి, నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అలాగే కరోనా పరిస్థితి తీవ్రంగా మారితే మాత్రం పరీక్షలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu