తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి జూలై 7న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన చేశారు. జూలై 7వ తేదీన ముందుగా ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోనున్నారని తెలిపారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సుల అందుకుని ప్రజాభివందనం చేస్తూ నాంపల్లి దర్గా మీదుగా గాంధీ భవన్ చేరుకుంటారని, మధ్యాహ్నం 12:00 గంటలనుంచి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్, పదిమంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ ఛైర్మన్, కన్వీనర్, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరియు టీపీసీసీ యొక్క ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ నియామకాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇటీవలే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నూతన కార్యవర్గం బాధ్యతలను స్వీకరించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ