బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందని, అందుకే ఆయనను తెలంగాణకే పరిమితం చేసేలా కుట్రలు చేస్తోందని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. శనివారం ఆయన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని, ఈ విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కాయని, మరి ఆయన ప్రజలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు.
బీజేపీకి పెద్ద షాక్ తగలనుందని తెలిపారు. కేంద్రంలో ఈసారి బరిలో ప్రతిపక్షాలు లేకుండా చేసి మూడోసారి కూడా గెలవాలని బీజేపీ కుటిల యత్నాలు చేస్తోందని, కానీ కేసీఆర్ వారికి చెక్ పెడతారని అన్నారు. మునుగోడు ఫ్లోరోసిస్ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం చూపిందని, ఈ అభివృద్ధి చూసే కమ్యూనిస్టులు తమతో కలిసి వస్తున్నారని తెలిపారు. ఇక మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతే తన పదవి పోతుందని రేవంత్ రెడ్డి ఏడుస్తున్నారని, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోనే జోడు కుదర్చలేకపోతున్నారని, అలాంటిది దేశాన్ని ఏం జోడిస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఉప ఎన్నికలతో ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికను పోల్చలేమని మంత్రి జగదీష్ రెడ్డి స్ఫష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY